తల్లి వద్దే భావోద్వేగాలు.. ఎందుకంటే?

పిల్లలు తమ కోపాన్ని, ఏడుపును ఎక్కువగా తల్లి ముందే చూపిస్తుంటారు. దీనికి కారణం అమ్మపై ఉన్న నమ్మకమేనని నిపుణులు చెబుతున్నారు. ‘తాము ఎలా ప్రవర్తించినా తల్లి వదిలి వెళ్లదని, ఆమె వద్దే తమకు రక్షణ ఉంటుందని వారు భావిస్తారు. పిల్లలు అమ్మ దగ్గరే అన్ని భావోద్వేగాలనూ స్వేచ్ఛగా బయటపెడతారు. ఇది వారి మధ్య ఉన్న బలమైన అనుబంధానికి గుర్తు. అందుకే అరిస్తే కోప్పడకుండా వారిని అర్థం చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు.