
తొలిప్రేమ జ్ఞాపకం ఎప్పటికీ చెరిగిపోదు అంటారు. అది ఈ జంట విషయంలో అక్షర సత్యమైంది. కేరళకు చెందిన జయప్రకాష్, రష్మీలు టీనేజ్లో విడిపోయి దశాబ్దాల కాలం వేర్వేరు జీవితాలను గడిపారు. జీవిత భాగస్వాములను కోల్పోయిన తర్వాత విధి వీరిని మళ్లీ కలిపింది. పాత జ్ఞాపకాల సాక్షిగా పిల్లల అంగీకారంతో 60 ఏళ్ల వయసులో వీరిద్దరూ ఒక్కటయ్యారు. నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలుస్తుందంటూ ఈ జంటను నెటిజన్లు కొనియాడుతున్నారు.